Breaking News

Day: July 29, 2021

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీపీ పి.శ్రీనివాస్​గౌడ్​ గురువారం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉజ్వల భవిష్యత్​ను ఏర్పాటుచేసుకుని తద్వారా భారతదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శారదమ్మ, సర్పంచ్​ఎస్.మహేశ్​రావు, ఎస్ఎంసీ చైర్మన్​బి.యాదయ్య, ఉపాధ్యాయులు భాస్కర్​రెడ్డి, జహంగీర్, నాగేశ్వర్ రావు, సుధారాణి పాల్గొన్నారు.

Read More