అక్కినేని అఖిల్కు టైం కలిసిరావడం లేదు. ఈ యువ హీరో నటించిన తొలి మూడు చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో వెబ్సీరీస్లో నటించేందుకు అఖిల్ సిద్ధమవతున్నట్టు టాక్. ‘అఖిల్’ ‘హలో’ ‘మిస్టర్ మజ్ను’ ఈ మూడు చిత్రాలు అఖిల్ ను నిరాశపరిచాయి. అయినప్పటికీ నటుడిగా కొంతమేర గుర్తింపు పొందాడు. డాన్సులు, ఫైట్ సీన్లలో ఎంతో బాగా చేస్తున్నాడని అక్కినేని అభిమానులు ప్రశంసలు గుప్పించారు. కానీ నటనలో కొంత పరిణతి సాధించాలని సినీ విమర్శకుల సూచన. ఈ […]
ఢిల్లీ: ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక నుంచి భారత్లో తమ క్యాంపస్లను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ఇకనుంచి విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలోని పలు నగరాల్లో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయనున్నాయి. అంతర్జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను భారత్లో నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కాగా ఆయా విద్యాసంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులను వసూలు చేయకుండా ఎన్ఈపీ(నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) కంట్రోల్ చేయనున్నది. […]
ముంబై: కరోనా నేపథ్యంలో మాస్కులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో కొందరు అక్రమార్కులు ఎన్95 మాస్కులంటూ నకిలీవి తయారు చేసి ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా అటువంటి నకిలీ మాస్కుల రాకెట్ను ముంబై పోలీసులు ఛేదించారు. రూ.21.39 లక్షల మాస్కులను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని భీవాండికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి భారీ ఎత్తున నకీలీ మాస్కులను తీసుకొచ్చాడు. అనంతరం వాటిని ముంబై, థానేలోని పలు మెడికల్ షాపుల్లో విక్రయించాడు. పోలీసులకు ఫిర్యాదుల అందడంలో […]
ఢిల్లీ: పోలీసుల మీదకు రివాల్వర్ గురిపెట్టిన ఓ దోపిడీ దొంగను గురువారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని అండ్రూస్ గంజ్కు చెందిన ఓవ్యక్తి ప్రజలను బెదిరిస్తూ డబ్బు, నగలు దోపిడీ చేస్తున్నాడు. స్థానికులు ఫిర్యాదుతో సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు అక్కడికి వెళ్లారు. దీంతో ఆ క్రిమినల్ ఓ పోలీస్ను రివాల్వర్తో కాల్చబోయాడు. అప్రమత్తమైన మరో కానిస్టేబుల్ చాకచక్యంగా అతడిని వెనుకనుంచి పట్టుకొన్నాడు. అనంతరం అతడిని పోలీసులు రిమాండ్కు తరలించారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు సోమెన్ మిత్రా (78) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా సీవోపీడీ ( క్రానిగ్ అబ్స్క్రక్టివ్ పుల్మోనరీ వ్యాధి)తో బాధపడుతూ కోల్కతాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కాగా గురువారం తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. సోమెన్ కరోనాతో మృతిచెందారన్న వార్తల్లో నిజం లేదని ఆసపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయనకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని తెలిపాయి. సోమెన్ మృతికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, […]
న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,123 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా 64.4 శాతం రికవరీ రేటు ఉన్నదని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 10,20,582 మంది కరోనా నుంచి కోలుకోగా.. కేవలం గత 24 గంటల్లోనే 32,553 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 34, 968 మంది పొట్టనబెట్టుకున్నది. 5,28,242 యాక్టివ్ కేసులున్నాయి.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం కొత్తగా 1,811 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి 60,717 కేసుల నిర్ధారణ అయ్యాయి. ఒకేరోజు 13 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 505 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 521 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 289 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్18, భద్రాద్రి కొత్తగూడెం 27, జగిత్యాల 15, జనగాం 22, జయశంకర్భూపాలపల్లి 20, జోగుళాంబ […]
కూలి పనులకు వెళ్తున్న విద్యావలంటీర్లు కరోనా ప్రభావంతో బతుకులు ఆగమాగం పెండింగ్ జీతాలైనా ఇవ్వండని వేడుకోలు :: సుంకే కుమార్, కౌడిపల్లికరోనా మహమ్మారి మధ్యతరగతి ప్రజల జీవనంపై దెబ్బకొట్టింది. ఓ వైపు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ.. మరోవైపు ప్రాణాలను హరించేస్తోంది. ఎంతో మంది తమ జీవనోపాధిని కోల్పోయి బతుకుజీవుడా అని కాలం వెళ్లదీస్తున్నారు. నెలవారి జీతంతో బతికే కుటుంబాల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడింది. కరోనా పుణ్యమా! అని ఉన్నత చదువులు చదివిన విద్యావలంటీర్లు రోజువారీ […]