సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ లో పత్తి పంటను మిడతలు ఆశించిన నేపథ్యంలో సంగారెడ్డి డాట్ సెంటర్ సైంటిస్ట్ డాక్టర్ రాహుల్ బుధవారం గ్రామాన్ని సందర్శించారు. మిడతలు ఆశించిన నడిపోల్లా బాలయ్య పత్తి పంటను పరిశీలించారు. ఈ మిడతలు దండు స్వభావం కలిగినవి, కొన్ని మొక్కలను మాత్రమే ఆశిస్తాయని ఆయన తెలిపారు. ఈ రకం మిడతలు ముందుగా పొలం గట్టు మీద గుడ్లు పెట్టి పదిరోజుల తర్వాత పిల్లలై మొక్కలను ఆశిస్తాయని […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బుధవారం 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,20,390 కు చేరింది. తాజాగా కరోనాతో 65 మంది మృతి చెందారు. మొత్తంగా 1,213 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 63,771 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,784 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 55,406 ఉంది. ఇక మహమ్మారి బారినపడిన వారి సంఖ్యను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం […]
సారథి న్యూస్, నార్సింగి: గండిపేట చెరువులోకి వాహనాలు వెళ్లడం నిషేధం. సరదాగా తిరిగేందుకు నగరానికి చెందిన కొందరు మిత్రులు.. రెండు రోజుల క్రితం గండిపేట చెరువులోకి వెళ్లారు. నీళ్లులేక ఎండిపోయిన నేపథ్యంలో గుంతల్లో ఉన్న బురదలో వీరి వాహనాలు చిక్కుకున్నాయి. వాటిని బయటికి లాగేందుకు ట్రాక్టర్ను తీసుకురాగా అదీ బురదలో కూరుకు పోయింది. వీటిని వెలికి తీయడానికి జేసీబీ, హిటాచీలను రప్పించగా అవి కూడా బురదలో కూరుకు పోయాయి. వాటిని వెలికి తీయడానికి పలు విధాలుగా ప్రయాస […]
డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో 3,850 జాబ్స్ దరఖాస్తుల స్వీకరణ జూలై 27 నుంచే.. పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేస్తోంది. మొత్తం 3,850 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ సర్కిల్లోనూ ఖాళీలు ఉన్నాయి. గుజరాత్, తెలంగాణ సర్కిల్కు 550 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.ముఖ్యమైన తేదీలుదరఖాస్తు […]
జాతీయ విద్యావిధానానికి కొత్త హంగులు వృత్తి, ఉపాధి లభించేలా నూతన వ్యవస్థ కేంద్రం మానవ వనరుల శాఖ.. ఇక విద్యామంత్రిత్వ శాఖగా మార్పు ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వశాఖగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ […]
లఖ్నవూ: ఆగస్టు 5న అయోధ్యలో జరగబోయే రామ మందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతో పాటు విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్ర పన్నుతోందని కేంద్రనిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దీంతో అయోధ్య, ఢిల్లీ, జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మర తనిఖీలు చేపడుతున్నాయి. నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. అయోధ్యలో భూమిపూజ నిర్వహించే రోజు, జమ్మూకశ్మీర్ ఆర్టికల్ 370ను రద్దుచేసిన రోజు ఆగస్టు 5 కావడంతో భద్రతా […]
తక్కువ టైమ్లో సూపర్ ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ అయిపోయింది పూజాహెగ్డే. తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే పూజకు బాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఉంది. హృతిక్ రోషన్ ‘మొహంజదారో’ సినిమాతో వారికీ దగ్గరైన పూజ ఆ మధ్య ‘హౌస్ఫుల్4’ తో కూడా అక్కడి అభిమానులను ఆకట్టుకుంది. తర్వాత భాయ్ సల్మాన్ ఖాన్తో ‘కబీ ఈద్ కబీ దీవాళి’లో జతకడుతోంది. ఈ సినిమా లైన్ లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టులో […]
సారథి న్యూస్, కర్నూలు : నంద్యాల మండలం చాపిరేవుల టోల్ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. గూడ్స్ కొరియర్ లారీని కారు ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తూన్న ఎస్బీఐ ఉద్యోగి శివకుమర్ సజీవదహనం అవగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వ్యక్తిని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.