సారథి న్యూస్, అలంపూర్: జూన్ నుంచి తమకు జీతాలు ఇవ్వడం లేదని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పీటీఐలు (పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్) ఆందోళన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 240 మంది పీటీఐలు పనిచేస్తున్నారు. వీరంతా సర్వ శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని.. తమకు జీతభత్యాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇండ్ల వద్ద ఉండి కుటుంబసమేతంగా ఆందోళనకు దిగారు.
రాత్రిపూట కర్ఫ్యూ ఉండదు కేంద్ర హోంశాఖ అన్లాక్3.0 మార్గదర్శకాలు న్యూఢిల్లీ: అన్లాక్3.0 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం విడుదల చేసింది. జూలై 31తో అన్లాక్ 2.0 గడువు ముగియనుండడంతో.. కేంద్రప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. సినిమా హాళ్లు, వినోద పార్కులు, బార్లు మూసివేయాలని సూచించింది. స్విమ్మింగ్ పూల్స్, యోగా సెంటర్లు, జిమ్లకు కేంద్రం అనుమతిచ్చింది. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని సూచించింది. రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేసింది. ఎట్ హోం కార్యక్రమాలపై రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకుంటారని […]
సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: కాలం మారుతున్నా కొద్దీ యాంత్రిక శక్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రైతులు వ్యవసాయ పొలంలో దుక్కులు దున్నేకాడి నుంచి పంటను తీసుకెళ్లే వరకు ప్రతిపనిలో యంత్రాలు, ట్రాక్టర్లను వాడుతున్నారు. కానీ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో రైతులు పాతకాలం నాటి పద్ధతులనే వాడుతున్నారు. అందుకు ఈ ఫొటోలే నిదర్శనం. కంగ్టి మండల పరిధిలోని చాప్టా(కే) గ్రామంలో యూరియా, డీఏపీ మందు సంచులు, సేంద్రియ ఎరువులను […]
ఇప్పటికే అలవైకుంఠపురంలో చిత్రంలో పూజా హెగ్డే తన కాళ్ల అందాలతో యువతను కట్టిపడేసిన విషయం తెలిసిందే. ఆమె కాళ్ల అందానికి చిత్రపరిశ్రమలోని దర్శకులందరూ పడిపోయినట్టున్నారు. తాజాగా అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ తన జిఎ 2 పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లోనూ పూజ తన కాళ్లతో అఖిల్ చెవులను టచ్చేస్తుంది. ఈ […]
కరోనా విపత్తువేళ రాజకీయనాయకులు నోటికొచ్చినట్టు ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బెలారస్ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఓ సంచలన ప్రకటన చేశాడు. ప్రతి ఒక్కరూ రోజూ 50 ఎంఎల్ వోడ్కా తీసుకుంటే కరోనా మన గొంతులోనే చనిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అతడి సూచనపై సోషల్మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ నడుస్తోంది. తనకు కరోనా సోకిందని.. తాను రోజు వోడ్కా తాగి కరోనాను జయించానని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ ను నిర్మూలించాలంటే వోడ్కాకు మించిన డ్రగ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం 1,764 కరోనా కేసులు నమోదయ్యాయి. 12 మంది చనిపోయారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,906కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 43,751 మంది డిశ్చార్జ్ కాగా, 492 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,663 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. 9,178 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 15, భద్రాద్రి 30, హైదరాబాద్ 509, […]
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక రఫెల్ యుద్ధవిమానాలు భారత్కు వచ్చేశాయి. బుధవారం మధ్యాహ్నం అంబాలా ఎయిర్బేస్కు చేరుకున్నాయి. అబుదాబీ అల్ద ఫ్రా సైనిక స్థావరం నుంచి ఇవి బయలుదేరాయి. తొలివిడతగా ఐదు యుద్ధవిమానాలు వచ్చాయి. వీటిలో మూడు యుద్ధ విమానాలు కాగా, రెండు శిక్షణ విమానాలు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు 50వేల అడుగుల ఎత్తుకు ఎగరగలవు. అణ్వాయుధాలను సైతం తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతార్ దేశాల వద్ద మాత్రమే ఉన్న ఈ ఫ్లైట్ ఉన్నాయి. ప్రస్తుతం […]
తెలుగులో బోలెడు సినిమాలు చేసి కోలీవుడ్లో పాగా వేసింది హీరోయిన్ త్రిష. అక్కడ ఆమె కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇంతకు ముందు మాదిరిగా గ్లామర్పాత్రలు కాకుండా ఫిమేల్ సెంట్రిక్ కథలను ఎంచుకుంటోంది. అలాగే విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలే ఎక్కువగా చేస్తోంది కూడా. అందుకేనేమో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’లో కూడా ఆఫర్ వచ్చినా వద్దనుకుంది అంటున్నారు. అయితే త్రిష గర్జనై, రాంగీ, పొన్నియన్ సెల్వం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా […]