సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలకేంద్రం, గండిగోపాల్రావుపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్వో రవిసింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో సౌకర్యాలు ఏలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. విధిగా టెస్టులు చేస్తున్నారా అని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రతిరోజు 50 మందికి పరీక్షలు చేస్తున్నామని డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రాధిక రవిసింగ్కు తెలిపారు. కార్యక్రమంలో గోపాల్రావు పేట ఎంపీటీసీ ఎడవెళ్లి కరుణశ్రీ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
- August 25, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CARONA
- DMHO
- HYDERABAD
- KARIMNAGAR
- TESTS
- కరోనా
- టెస్టులు
- పాజిటివ్కేసులు
- Comments Off on సౌలతులు ఎట్లున్నయి?