Breaking News

సౌలతులు ఎట్లున్నయి?

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలకేంద్రం, గండిగోపాల్​రావుపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్​వో రవిసింగ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్​సీలో సౌకర్యాలు ఏలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. విధిగా టెస్టులు చేస్తున్నారా అని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రతిరోజు 50 మందికి పరీక్షలు చేస్తున్నామని డాక్టర్​ శ్రీనివాస్, డాక్టర్​ రాధిక రవిసింగ్​కు తెలిపారు. కార్యక్రమంలో గోపాల్​రావు పేట ఎంపీటీసీ ఎడవెళ్లి కరుణశ్రీ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.