Breaking News

మధిరలో అడుగడుగునా శానిటైజేషన్​

మధిరలో అడుగడుగునా శానిటైజేషన్​

సారథి న్యూస్, మధిర: కరోనాతో కకావిలమవుతున్న మధిర పట్టణంలో అంగుళం జాగా కూడా వదలకుండా శానిటైజేషన్​ చేయిస్తున్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. మధిర పట్టణంలో శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి మొదలుపెట్టి అన్ని మెయిన్​రోడ్లు, ఇరుకైన గల్లీల్లోనూ శానిటైజేషన్​చేశారు. కరోనా వైరస్​వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రక్షణ చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చొరవను చూసి పలువురు అభినందిస్తున్నారు. ఆయన వెంట మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు, మల్లాది వాసు, మధిర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిరియాల రమణ గుప్తా, కోన ధనికుమార్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు చావా వేణు, బండారు నరసింహారావు పాల్గొన్నారు.