సారథి న్యూస్, నార్సింగి: గండిపేట చెరువులోకి వాహనాలు వెళ్లడం నిషేధం. సరదాగా తిరిగేందుకు నగరానికి చెందిన కొందరు మిత్రులు.. రెండు రోజుల క్రితం గండిపేట చెరువులోకి వెళ్లారు. నీళ్లులేక ఎండిపోయిన నేపథ్యంలో గుంతల్లో ఉన్న బురదలో వీరి వాహనాలు చిక్కుకున్నాయి. వాటిని బయటికి లాగేందుకు ట్రాక్టర్ను తీసుకురాగా అదీ బురదలో కూరుకు పోయింది. వీటిని వెలికి తీయడానికి జేసీబీ, హిటాచీలను రప్పించగా అవి కూడా బురదలో కూరుకు పోయాయి. వాటిని వెలికి తీయడానికి పలు విధాలుగా ప్రయాస పడుతున్నా మంగళవారం సాయంత్రం వరకు ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు నిషేధాన్ని ఉల్లంఘించి చెరువు ఎఫ్టీఎల్లో ప్రవేశించిన వాహనాలపై చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి ఇన్స్పెక్టర్ గంగాధర్ తెలిపారు. రెండుకార్లు, ట్రాక్టర్, జేసీబీ, హిటాచీలు చెరువులోకి ప్రవేశించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
- July 29, 2020
- Archive
- తెలంగాణ
- లోకల్ న్యూస్
- హైదరాబాద్
- GANDIPET
- గండిపేట
- జేసీబీ
- Comments Off on బురదలో కూరుకున్న వాహనాలు