Breaking News

పట్టుదలతో చదివితేనే భవిష్యతు

సారథి న్యూస్, బెజ్జంకి: విద్యార్థులు తల్లిదండ్రులు కలలను సాకారం చేయాలని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ పేర్కొన్నారు. బుధవారం బెజ్జంకి ఆదర్శ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇంటర్​ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రవళిక(973, బైపీసీ), స్వీటీ (971 ఎంపీసీ)లను అభినందించారు. అనంతరం మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. విద్యార్థులు పట్టుదలతో చదివితేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని చెప్పారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్, లెక్చరర్లు,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.