Breaking News

నేను అనుకోలేదు..

నేను అనుకోలేదు..

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రానుందన్న వార్త కొద్ది రోజులగా వైరల్ అవుతూ ఉంది. అభిమానులు కూడా వీరి కాంబో వచ్చే సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కూడా. ఈ సినిమా కి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అన్న టైటిల్ అనుకుంటున్నామని, వచ్చే సమ్మర్ లోపు ఈ చిత్రాన్ని విడుదల చేసేయాలని అనుకుంటున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే తాజాగా ఓ వారం రోజుల నుంచి ఈ మూవీలో మంచువారి హీరో మనోజ్ ఎన్టీఆర్ కి దీటుగా విలన్​గా నటించనున్నాడనే వార్తొకటి గుప్పుమంది. ఆ వార్తలపై మనోజ్ స్పందిస్తూ.. ‘నన్ను ఎన్టీఆర్ సినిమా గురించి ఎవరూ సంప్రదించలేదు.. అయినా నేను విలన్ పాత్ర చేయడానికి సిద్ధమే.. కానీ దానికి ఇంకాస్త సమయం పడుతుంది..’అని కూల్​గా చెప్పాడు. సో ఇంకా ఈ సినిమాలో విలన్ ఎవరన్న విషయం తేలలేదు. ఈ విషయం పై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు కూడా. పొలిటికల్ ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నాడు. కాగా మనోజ్ సొంత నిర్మాణంలో ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా చేస్తున్నాడు.