Breaking News

ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

సారథి న్యూస్, వాజేడు: 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ములుగు జిల్లా వాజేడు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వాజేడు నాగారం పంచాయతీలో సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, సెక్రటరీ అశోక్, పెనుగోలు కాలనీలో అంగన్​వాడీ టీచర్ నాగలక్ష్మి, మల్లక్క, పెద్దగొళ్లగూడెంలో సర్పంచ్ మేనక, సెక్రటరీ శిరీష, మెురుమూరులో పూసం నరేశ్, సెక్రటరీ జెండాను ఎగరవేశారు.

కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గొంది రమణ రావు, బీసీ సెల్ మండలాధ్యక్షుడు గార నాగార్జునరావు, కో ఆప్షన్ సభ్యుడు షేక్ నిజాముద్దీన్, జిల్లా రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు తల్లడి నానిబాబు, నాగారం ఉపసర్పంచ్ కల్లూరు సతీష్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు చెన్నం సాంబశివరావు, కాకర్లపూడి వినోద్, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడు చెన్నం స్వామి, పీఏసీఎస్​మాజీ మండలాధ్యక్షుడు దంతులూరి సూర్యనారాయణ వర్మ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజా వత్సవాయి అచ్యుత జగపతివర్మ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.