Breaking News

కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేయాలి

సారథి న్యూస్, గోదావరిఖని: నగర పాలక సంస్థలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో(కోల్డ్ స్టోరేజ్) శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని బుధవారం కమిషనర్ పి.ఉదయ్ కుమార్ కు సీపీఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రామగుండం నగరంలో మార్కెటింగ్ దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుండడం శుభపరిణామని అన్నారు. ప్రధానంగా కూరగాయలు, పండ్లు, చేపలు వంటివి నిలువ చేసుకోవడానికి గిడ్డంగులు లేకపోవడంతో ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి గడప శ్రీకాంత్, మండల శ్రీనివాస్ పాల్గొన్నారు.