సారథి న్యూస్, రామాయంపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అధికారులు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామంలో 178 మంది కొండపోచమ్మ రిజర్వాయర్లో భూములు కోల్పోయారు. వీరికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మెదక్ ఆర్డీవో సాయిరాం చెక్కులను పంపిణీ చేశారు. ఎండాకాలంలో కూడా చెరువులన్నీ నిండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జైరాం, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, కో అప్షన్ సభ్యులు గౌస్, స్థానిక సర్పంచు మండల ఫోరం అధ్యక్షులు అమర్ సేనారెడ్డి, ఎంపీటీసీ రాజిరెడ్డి, మండల టీఆర్ఎస్ నాయకులు సుధాకర్ రెడ్డి, దయాకర్, సంతోష్ గౌడ్, నగేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
- June 17, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- KONDAPOCHAMMA
- medak
- RAMAYAMPET
- TELANGANA
- నిర్వాసితులు
- భూములు
- Comments Off on కొండపోచమ్మ నిర్వాసితులకు పరిహారం