Breaking News

ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ ​సూసైడ్​

ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్​సూసైడ్​

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఓ ఎయిర్​ఫోర్స్​ ఆఫీసర్​ సూసైడ్​ చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్​కు చెందిన ఇంద‌ర్‌పాల్ సింగ్(53)వైమానిక ద‌ళంలో వారెంట్ ఆఫీస‌ర్​గా పనిచేస్తున్నాడు. త‌న స‌ర్వీస్ పిస్టల్​తో త‌ల‌పై కాల్చుకున్నాడు. వెంట‌నే స‌హ‌చ‌రులు ఆయ‌న‌ను ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంట‌నే ఇంద‌ర్‌పాల్ భౌతిక కాయాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్పగించినట్లు తెలిపారు. కాగా, ఈనెల జ‌మ్ము రీజియ‌న్‌లో సూసైడ్​ చేసుకున్న రెండో వైమానికద‌ళ ఉద్యోగి ఇంద‌ర్‌పాల్. ఆగ‌స్టు 8న కూడా ఉదంపూర్‌లో వైమానిక ద‌ళానికి చెందిన ఓ జ‌వాన్ త‌న స‌ర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.