సారథిన్యూస్, కరీంనగర్: అతి జాగ్రత్త కొంపముంచింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో శానిటైజర్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా వండుకున్న చికెన్ను శానిటైజర్తో శుభ్రపరిచాడు. ఈ చికెన్ తిన్న వ్యక్తి ప్రస్తుతం తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నాడు. కరీంనగర్ జిల్లా జిమ్మికంట మండలం పాపక్కపల్లికి చెందిన యాకుబ్ దినసరి కూలీ.. భార్య ముగ్గురు పిల్లలతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నాడు. క్రమం తప్పకుండా శానిటైజర్ వాడుతున్నాడు. అయితే ఇటీవల అతడికి తెలిసనవాళ్లేవరో చికెన్పై కూడా కరోనా వైరస్ ఉంటుందని చెప్పారట. దీంతో కంగారు పడ్డ యాకూబ్ చికెన్ వండినతర్వాత దానిపై శానిటైజర్ పోశాడు. ఆ చికెన్ను కుటుంబసభ్యులు ఎవరూ తినలేదు. యాకూబ్ ఒక్కడు మాత్రమే ఆ చికెన్ తిన్నాడు. దీంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం యాకుబ్ పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం అతడి చేతులు, కాళ్లు కూడా పనిచేయడం లేదు. పేగులకు గాయాలయ్యాయని.. ప్రస్తుతం ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏమీ లేదని వైద్యులు చెప్పారు. శానిటైజర్తో చేతులు శుభ్రపరుచుకోవాలి తప్ప.. ఆహారపదార్థాల మీద వాటిని చల్లవద్దని.. కూరగాయలను శానిటైజర్తో శుభ్రపరచవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
- September 9, 2020
- Archive
- Top News
- కరీంనగర్
- CARONA
- CHIKEN
- KARIMNAGAR
- SANITATION
- జాగ్రత్త
- మహమ్మారి
- శానిటైజర్
- Comments Off on అతి జాగ్రత్తే కొంపముంచింది