Breaking News

అతి జాగ్రత్తే కొంపముంచింది

సారథిన్యూస్​, కరీంనగర్​: అతి జాగ్రత్త కొంపముంచింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో శానిటైజర్​ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా వండుకున్న చికెన్​ను శానిటైజర్​తో శుభ్రపరిచాడు. ఈ చికెన్​ తిన్న వ్యక్తి ప్రస్తుతం తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నాడు. కరీంనగర్​ జిల్లా జిమ్మికంట మండలం పాపక్కపల్లికి చెందిన యాకుబ్​ దినసరి కూలీ.. భార్య ముగ్గురు పిల్లలతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నాడు. క్రమం తప్పకుండా శానిటైజర్​ వాడుతున్నాడు. అయితే ఇటీవల అతడికి తెలిసనవాళ్లేవరో చికెన్​పై కూడా కరోనా వైరస్​ ఉంటుందని చెప్పారట. దీంతో కంగారు పడ్డ యాకూబ్​ చికెన్​ వండినతర్వాత దానిపై శానిటైజర్​ పోశాడు. ఆ చికెన్​ను కుటుంబసభ్యులు ఎవరూ తినలేదు. యాకూబ్​ ఒక్కడు మాత్రమే ఆ చికెన్​ తిన్నాడు. దీంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం యాకుబ్​ పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం అతడి చేతులు, కాళ్లు కూడా పనిచేయడం లేదు. పేగులకు గాయాలయ్యాయని.. ప్రస్తుతం ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏమీ లేదని వైద్యులు చెప్పారు. శానిటైజర్​తో చేతులు శుభ్రపరుచుకోవాలి తప్ప.. ఆహారపదార్థాల మీద వాటిని చల్లవద్దని.. కూరగాయలను శానిటైజర్​తో శుభ్రపరచవద్దని వైద్యులు సూచిస్తున్నారు.