![BJP](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/BJPPP.jpg?fit=500%2C500&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని పంది కుంట గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల సందేశాత్మకలేఖను బీజేపీ నేతలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీ పాలన దేశం ఎంతో పురోభివృద్ధి చెందిందని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురం శెట్టి చంద్రమౌళి కార్య కర్తలు పాల్గొన్నారు.