![నాణ్యమైన మద్యం అమ్మాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/KNL-PARTH-2F.jpg?fit=450%2C411&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: గతంలో ఎక్కడా కనిపించని బ్రాండ్లను తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనివల్ల తాగుడుకు అలవాటుపడిన పేదలు గంజాయి, నాటుసారా తాగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారధి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విడత వారీగా మద్య నిషేధానికి తాము మద్దతిస్తామని, కానీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సరైన, నాణ్యమైన మద్యం విక్రయించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇప్పుడు శానిటైజర్లు తాగి మృతి చెందుతున్నారని, ఇవి ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.