![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/chanderrrrffgf.jpg?fit=700%2C348&ssl=1)
గోదావరిఖని: కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులే కాక మత్స్యకారులు కూడా బాగుపడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గోదావరి దిశ మార్చిన అపరభగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. అదివారం ఆయన కుందనపల్లి, గోదావరినది వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు అన్ని కులవృత్తులకు న్యాయం చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.