సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,567 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 50,826కు పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 1,661 మంది రికవరీ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 9 మంది కరోనా మృత్యువాతపడ్డారు. ఇప్పటిదాకా 438 మంది మృతిచెందారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ 662 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 213, మేడ్చల్33, సంగారెడ్డి 32, ఖమ్మం 10, కామారెడ్డి 17, వరంగల్ అర్బన్75, వరంగల్ రూరల్ 22, కరీంనగర్ 38, జగిత్యాల 14, మహబూబాబాద్18, మెదక్27, మహబూబ్నగర్61, భూపాలపల్లి 25, నల్లగొండ 44, సిరిసిల్ల 62, ఆదిలాబాద్17, నాగర్కర్నూల్51, జనగాం 22, నిజామాబాద్38, ములుగు 17, సూర్యాపేట 39 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు హెల్త్తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులెటిన్ను విడుదల చేసింది.